మైనర్పై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2022-08-09T04:20:08+05:30 IST
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మైనర్పై అత్యాచారానికి యత్నించిన ముగ్గురు యువకులపై సోమవారం రాత్రి ఫోక్సో కేసు నమోదయింది.
ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు
కారేపల్లి, ఆగస్టు8: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మైనర్పై అత్యాచారానికి యత్నించిన ముగ్గురు యువకులపై సోమవారం రాత్రి ఫోక్సో కేసు నమోదయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన ఓ 16ఏళ్ల బాలిక భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకుంటోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంటికి రాగా.. సోమవారం సదరు బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అంగోత్ వంశీ, అంగోత్ పుల్లరావు, మాలోత్ వీరేంద్ర ముగ్గురు ఆమె ఇంట్లోకి వెళ్లి.. బాలిక నోరు మూసి అత్యాచారానికి యత్నించారు. దీంతో ఆ బాలిక వారి నుంచి రక్షణ కోసం ఒకరి చేతిని కొరకి, కేకలు వేయడంతో వదిలేసిన పరారయ్యారు. ఈ విషయాన్ని సాయంత్రం ఇంటికి తల్లిదండ్రులకు ఆ బాలిక చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అదే సమయలోఓ గ్రామానికి చెందిన కొందరు రాజీకి విఫలయత్నం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కుష్కుమార్ తెలిపారు