అధికారులపై వైసీపీ నాయకుల దాడి

ABN , First Publish Date - 2022-01-27T21:08:25+05:30 IST

పలువురు అధికారులపై వైసీపీ నాయకులు

అధికారులపై వైసీపీ నాయకుల దాడి

విశాఖపట్నం: పలువురు అధికారులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. పెందుర్తి మండలం, సత్తివాని పాలెం గ్రామంలో సర్వే నెంబర్ 355 చెందిన గడ్డ వాగును పలువురు  ఆక్రమించారు. వైసీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మళ్ళా విజయ ప్రసాద్ అనుచరులు 80 సెంట్లు భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆక్రమణలను పెందుర్తి ఆర్.ఐ, వీఆర్వో తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొగిస్తున్న వారిపై 89వ వార్డ్ వైసీపీ ఇంచార్జ్ దొడ్డి కిరణ్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వైసీపీ నాయకులు తమపై ఈ రకంగా దాడులకు పాల్పడటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా తమ భూమిలో ఉన్న కాంపౌండ్ వాల్‌ను తొలగించడంతో అధికారులను అడ్డుకున్నామని కిరణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-27T21:08:25+05:30 IST