పప్పు చేయలేదని భార్యపై కొడవలితో దాడి

ABN , First Publish Date - 2020-06-02T09:52:03+05:30 IST

పప్పు చేయలేదని భార్యపై కొడవలితో దాడి చేశాడు ఓ భర్త. స్థానిక వీవర్స్‌కాల నీలో నివాసముంటున్న

పప్పు చేయలేదని భార్యపై కొడవలితో దాడి

హిందూపురం టౌన్‌, జూన్‌ 1: పప్పు చేయలేదని భార్యపై కొడవలితో దాడి చేశాడు ఓ భర్త. స్థానిక వీవర్స్‌కాల నీలో నివాసముంటున్న తిప్పేస్వామి చే నేత కార్మికుడు. లాక్‌డౌన్‌ సడలింపుతో సోమవారం ఉదయం పనికి బయల్దేరా డు. తాను అడిగిన మేరకు పప్పు చే య లేదని భార్య గౌతమిపై ఆగ్రహించాడు. ఆమె తలపై కొడవలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమా చారమిచ్చారు. ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిప్పే స్వామిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - 2020-06-02T09:52:03+05:30 IST