సర్వోమాక్స్ కేసులో రూ.13.5 కోట్లు అటాచ్
ABN , First Publish Date - 2022-03-15T22:50:48+05:30 IST
సర్వోమాక్స్ కేసులో రూ.13.5 కోట్లను ఈడీ
హైదరాబాద్: సర్వోమాక్స్ కేసులో రూ.13.5 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అవసరాల వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్రెడ్డికి చెందిన 15 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేస్తూ చర్యలు తీసుకుంది. బ్యాంక్ల్లో రూ.402 కోట్ల రుణాలు తీసుకొని మోసం చేసినట్టు అభియోగాలు వచ్చాయి. 2018 ఫిబ్రవరి 2న సీబీఐ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఇటీవల వెంకటేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది.