అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: దాసోజు
ABN , First Publish Date - 2021-04-15T09:17:22+05:30 IST
అంబేడ్కర్ జయంతి రోజున దళిత విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్పై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులు, ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ జయంతి రోజున దళిత విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్పై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులు, ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు. ఓ లంబాడీ బిడ్డను హెచ్చరించిన మంత్రి జగదీశ్రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.