వ్యక్తిపై అత్యాచారం, అట్రాసిటీ కేసు

ABN , First Publish Date - 2020-05-22T09:39:05+05:30 IST

ఓ మహిళను నమ్మించి మో సగించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ

వ్యక్తిపై అత్యాచారం, అట్రాసిటీ కేసు

ముమ్మిడివరం, మే 21: ఓ మహిళను నమ్మించి మోసగించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎం.పండుదొర తెలిపారు. ముమ్మిడివరం మండలంలో ఓ గ్రామానికి చెందిన వివా హితను భర్త వదిలివేయడంతో ఎనిమిదేళ్ల పాపతో కలిసి విడిగా ఉంటోంది. అదే మండలంలోని చినకొత్తలంక గ్రా మానికి చెందిన ముదునూరి రంగబాబు 2019, ఏప్రిల్‌ నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పకుండా ఉంటే పెళ్లి చేసుకుంటానని, లేక పోతే చంపుతానని బెదిరించాడని పోలీసులకు బాధితురా లు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పలుమార్లు అత్యా చారానికి పాల్పడ్డాడని, తనను పెళ్లి చేసుకోమని అతడిని ఇటీవల అడగ్గా కులం పేరుతో దూషించి అవమాన పరిచాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-22T09:39:05+05:30 IST