సంగారెడ్డి జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2021-08-06T23:19:16+05:30 IST
జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల గొంతు నులిమి కన్నతల్లి చంపింది. పిల్లలను
సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల గొంతు నులిమి, వారిని కన్నతల్లి చంపింది. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి జ్యోత్న పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం తల్లిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులను దేవాన్ష్(6), రుద్రాంష్(4)లుగా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణంగానే ఈ ఘటన జరిగనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.