అట్రాసిటీ కేసులను త్వరగా విచారించాలి: ఎర్రోళ్ల

ABN , First Publish Date - 2020-09-20T08:10:56+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సూచించారు.

అట్రాసిటీ కేసులను త్వరగా విచారించాలి: ఎర్రోళ్ల

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సూచించారు. కమిషన్‌ కార్యాలయంలో శనివారం ఐజీ పీసీఆర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఎర్రోళ్ల మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించడంతో కమిషన్‌కు రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేసుల విచారణ వేగవంతం చేసి, 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. 


Updated Date - 2020-09-20T08:10:56+05:30 IST