ముగ్గురు టీచర్ల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-07T07:16:00+05:30 IST

జిల్లాలో విధులకు గైర్హాజరవుతున్న ముగ్గురు టీచర్లను డీఈఓ శామ్యూల్‌ శనివారం సస్పెండ్‌ చేశారు.

ముగ్గురు టీచర్ల సస్పెన్షన్‌

అనంతపురం విద్య, మార్చి 6: జిల్లాలో విధులకు గైర్హాజరవుతున్న ముగ్గురు టీచర్లను డీఈఓ శామ్యూల్‌ శనివారం సస్పెండ్‌ చేశారు. బుక్కపట్నం మండలం కొండాపురం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీ రామ్మోహన్‌రెడ్డి, ధర్మవరం మండలం సీసీ కొత్తతోట ఎంపీపీఎ్‌సకు చెందిన ఎస్‌జీటీ మారుతీప్రసాద్‌, గుడిబండ మండలం వీరజ్జలపల్లి ఎంపీపీఎస్‌ స్కూల్‌కు చెందిన ఎస్‌జీటీ నవనీత కొంతకాలంగా విధులకు హాజరుకావట్లేదు. ఆయా మండలాల విద్యాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-03-07T07:16:00+05:30 IST