కొవిడ్ సేవలందించిన డాక్టర్లకు టీడీపీ ప్రశంసాపత్రాలు
ABN , First Publish Date - 2021-06-20T06:35:41+05:30 IST
కరోనా బాధితులకు ధె ౖర్యంగా వైద్య సేవలు అందించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని అనంతపురం మాజీ ఎ మ్మెల్యే వైకుంఠం ప్ర భాకరచౌదరి శనివారం అభినందించారు.
అనంతపురం వై ద్యం, జూన్ 19: కరోనా బాధితులకు ధె ౖర్యంగా వైద్య సేవలు అందించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని అనంతపురం మాజీ ఎ మ్మెల్యే వైకుంఠం ప్ర భాకరచౌదరి శనివారం అభినందించారు. కుటుంబ సభ్యులు సైతం కరోనా నేపథ్యంలో రోగులకు దూరంగా ఉంటున్నా.. వైద్య సిబ్బంది వారికి సేవలందించి ప్రాణాలు కాపాడటం గొప్ప విషయమన్నారు. అందుకే అలాంటి డాక్టర్లను, వైద్య సిబ్బందిని గుర్తించి, అభినందించాలనే టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు ప్రశంసాపత్రాలు పంపారన్నారు. వాటిని జిల్లాలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందించిన డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ సౌ జన్య, డాక్టర్ నవీనాబాయి, డాక్టర్ భవ్య, డాక్టర్ మమత, డాక్టర్ వీణతోపాటు మరో 30మందికి ఆయన అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుతీగౌడ్, డిష్ నాగరాజు పాల్గొన్నారు.