ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T06:10:19+05:30 IST

జిల్లావ్యాప్తంగా శనివారం గురుపౌర్ణమి వేడు కలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
అలంకరణలోసత్యసాయి మహాసమాధి

పుట్టపర్తి, జూలై 24: జిల్లావ్యాప్తంగా శనివారం గురుపౌర్ణమి వేడు కలు ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తిలోని సాయికుల్వంత్‌ సభామందిరంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువందనం పేరిట భక్తిగీతాలాపన చేపట్టారు. భక్తులు పెద్దఎత్తున మహాసమాధిని దర్శించుకున్నారు. పట్టణంలోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. కాగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వీ ఉషారాణి సత్యసా యి మహాసమాధిని దర్శించుకున్నారు. అంత కుముందు శాంతిభవన్‌ వద్ద కదిరి ఆర్డీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, అర్బన్‌ సీఐ బా లసుబ్రహ్యణ్యంరెడ్డి.. ఆమెకు స్వాగతం పలికారు.



Updated Date - 2021-07-25T06:10:19+05:30 IST