ఏకగ్రీవ పంచాయతీలకు పెరిగిన నజరానా

ABN , First Publish Date - 2021-01-27T07:02:12+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ప్రభు త్వం భారీ నజరానా ప్రకటించింది.

ఏకగ్రీవ పంచాయతీలకు పెరిగిన నజరానా

అనంతపురం రైల్వే, జనవరి26: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ప్రభు త్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ మే రకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల వరకు 15వేల జనాభాకంటే తక్కువ ఉన్న పంచాయతీలకు రూ.7 లక్షలు, ఆ పైన ఉంటే రూ.20 లక్షలు నజరానా అందించేవారు. ప్రస్తుతం రెండు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలలోపు ఉంటే రూ.10 లక్షలు, 5వేల నుంచి 10వేలలోపు ఉంటే రూ.15 లక్షలు, ఆ పైన ఉంటే రూ.20 లక్షలు నజరానా అందించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకూ ఏకగ్రీవమైతే నజరానా వర్తించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 1003 పంచాయతీలకుగాను 63 చోట్ల ఏ కగ్రీవమై, నజరానా దక్కించుకున్నాయి. ప్రస్తుతం పంచాయతీల సంఖ్య 1044కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ మేరకు ఏకగ్రీవాలవుతాయోనన్న చర్చ సాగుతోంది.

Updated Date - 2021-01-27T07:02:12+05:30 IST