డ్వామాలో బదిలీల జాబితా కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-11-01T10:53:49+05:30 IST

బదిలీల జాబితా విడుదల కోసం డ్వామా ఉద్యోగులు, సిబ్బంది నిరీక్షిస్తున్నారు.

డ్వామాలో బదిలీల జాబితా కోసం ఎదురుచూపులు

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 31: బదిలీల జాబితా విడుదల కోసం డ్వామా ఉద్యోగులు, సిబ్బంది నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల షెడ్యూల్‌ మేరకు శనివారంలోగా ఉద్యోగులు, సిబ్బంది బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అక్టోబరు 26,27వతేదీల్లో డ్వామా ఏపీఓలు, ఈసీ, కంప్యూటర్‌ ఆపరే టర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఐడబ్ల్యూఎంపీ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్‌ పూర్తి చేశారు. ఒకే స్థానంలో మూడే ళ్లకుపైగా పనిచేస్తున్న వారితోపాటు సొంత మండలాల్లో పనిచేస్తున్న వారి నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఆ తర్వాత బదిలీ జాబితాను సిద్ధం చేసి అనుమతుల కోసం జిల్లా యంత్రాంగానికి పంపారు. షెడ్యూల్‌ మేరకు శనివారం రాత్రిలోపు బదిలీల జాబితా విడుదల చేస్తారని అందరూ భావించారు. అయితే పలు రకాల పనుల్లో జిల్లా ఉన్న తాధికారి బిజీగా ఉండటంతో డ్వామా బదిలీల జాబితాను ఓకే చేయలేకపోయినట్లు సమాచారం.  జిల్లా ఉన్నతాధికారి అనుమతులు ఇచ్చేందుకు మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో అప్పటి దాకా ఉద్యోగులు, సిబ్బందికి నిరీక్షణ తప్పదు.

Updated Date - 2020-11-01T10:53:49+05:30 IST