కొడుకును కడతేర్చిన తల్లి

ABN , First Publish Date - 2020-10-29T10:02:34+05:30 IST

తాగుడుకు బానిసైన కుమారుడి వేధింపులు భరించలేక కన్న తల్లే కడతేర్చింది. మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన రంగమ్మ, ఓంకారప్ప దంపతులు వ్యవసాయ పను లు చేసుకుంటూ జీవనం సాగించేవారు.

కొడుకును కడతేర్చిన తల్లి

గార్లదిన్నె, అక్టోబరు 28: తాగుడుకు బానిసైన కుమారుడి వేధింపులు భరించలేక కన్న తల్లే కడతేర్చింది. మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన రంగమ్మ, ఓంకారప్ప దంపతులు వ్యవసాయ పను లు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమారులు నాగవర్ధన్‌ నా యుడు, పురుషోత్తం. పదేళ్ల క్రితం ఓంకారప్ప మృతి చెందాడు. అప్పట్నుంచి రంగ మ్మ.. కుమారులతో ఉంటోంది. కుమారుడు నాగవర్ధన్‌ నాయుడు (35) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. వివాహమవ గా.. భార్య వదిలేసి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే రోజూ మద్యం తాగి వచ్చి, తల్లి రంగమ్మ, తమ్ముడు పురుషోత్తంతో గొడవ పడుతుండేవాడు.

మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికెళ్లాడు. తనకు డబ్బులివ్వాలని తల్లి రంగమ్మతో గొడవకు దిగాడు. ఆమె ససేమిరా అనటంతో దాడికి యత్నించాడు. ఈ ఘర్షణలో కుమారుడి తలపై రంగమ్మ కర్రతో కొట్టింది. దీంతో అతడు ఇంట్లో నే స్పృహ తప్పి, పడిపోయా డు. మద్యం మత్తులో పడిపోయాడనుకున్నారు. ఉదయం చూసేసరికి అతడు మృతిచెందాడు. కు టుంబ సభ్యులు.. పోలీసులకు స మాచా రం అందించారు. ఆత్మకూరు రూరల్‌ సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి.. హత్యా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని అనంతపురం స ర్వజనాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-10-29T10:02:34+05:30 IST