కరోనా నుంచి కోలుకున్న డీఎస్పీకి సన్మానం

ABN , First Publish Date - 2020-10-01T09:40:57+05:30 IST

కరోనా నుంచి కోలుకుని, విధుల్లో చేరిన తాడిపత్రి డీఎస్పీ ఏ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సన్మానించారు. జూలైలో కరోనా బారిన పడిన డీఎస్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించు కున్నారు.

కరోనా నుంచి కోలుకున్న డీఎస్పీకి సన్మానం

అనంతపురం క్రైం, సెప్టెంబరు 30: కరోనా నుంచి కోలుకుని, విధుల్లో చేరిన తాడిపత్రి డీఎస్పీ ఏ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సన్మానించారు. జూలైలో కరోనా బారిన పడిన డీఎస్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించు కున్నారు. కోలుకుని, విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో బుధవారం  మర్యాదపూర్వకంగా స్థానిక జిల్లా పోలీ సు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సత్యయేసు బాబును కలిశారు.


దీంతో డీఎస్పీని ఎస్పీ సన్మానించారు. క రోనా సోకిందని ఆందోళన చెందకుండా వైద్యుల సలహాలు పాటించి, తగిన వైద్యం పొంది, పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో కోలుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-10-01T09:40:57+05:30 IST