నార్పల మద్యం దుకాణంలో రూ.29 లక్షలు గోల్మాల్
ABN , First Publish Date - 2020-10-01T09:37:19+05:30 IST
స్థానిక మద్యం దుకాణంలో రూ.29 లక్షలు గోల్మాల్ అయినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది.
రెండు రోజులుగా షాపు బంద్
నార్పల, సెప్టెంబరు 30: స్థానిక మద్యం దుకాణంలో రూ.29 లక్షలు గోల్మాల్ అయినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా సూపర్వైజర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మద్యం విక్రయాల్లో మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. డిపో యాప్లో లక్షలు తేడా ఉన్నట్లు తెలుసుకున్న అనంతపురం ఉన్నతాధికారులు మూడ్రోజుల కిందట మద్యం దుకాణంలో విచారణ చేపట్టారు.
దాదాపు రూ.29 లక్షలు గోల్మాల్ అయినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాన్ని బంద్ చేయించారు. గోల్మాల్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కొందరు ఎక్సైజ్ పోలీసులు, ఒక అధికారి, ఇద్దరు వైసీపీ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు ఉన్నతస్థాయి అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. గోల్మాల్పై ఎక్సైజ్ అధికారులు నార్పల పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు.