వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

ABN , First Publish Date - 2020-09-24T08:40:07+05:30 IST

మండలంలోని పోతురాజుకాలువ గ్రామం వద్ద అనంతపురం-తాడిప త్రి రహదారిపై బుధవారం వ్యవసా య కూలీల ఆటో టైరు పేలి, బోల్తా పడింది.

వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

ఒకరి మృతి.. 15 మందికి గాయాలు..


శింగనమల, సెప్టెంబరు 23:మండలంలోని పోతురాజుకాలువ గ్రామం వద్ద అనంతపురం-తాడిప త్రి రహదారిపై బుధవారం వ్యవసా య కూలీల ఆటో టైరు పేలి, బోల్తా పడింది. ప్రమాదంలో బాలిక జ్యోతి (17) మృతి చెందింది. పెద్దపప్పూ రు మండలం జూటూరు కొత్తపల్లికి చెందిన 16 మంది వ్యవసాయ కూలీలు బుధవారం ఉదయం గార్లదిన్నె మండలం సిరివరం గ్రామ పొలాల్లో వ్యవసాయ కూలి పనులకు బయల్దేరారు.


పోతురాజుకాలువ వద్ద ఆటో టైరు పగిలి, అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులోని కూ లీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. వారిలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మస్తాన్‌వలి.. సిబ్బందితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-09-24T08:40:07+05:30 IST