కార్మిక చట్ట సవరణలను కేంద్రం విరమించుకోవాలి

ABN , First Publish Date - 2020-09-24T08:46:43+05:30 IST

కార్మిక హక్కులను కాలరాసే చట్ట సవరణల బిల్లులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

కార్మిక చట్ట సవరణలను కేంద్రం విరమించుకోవాలి

ధర్నాలో కార్మికసంఘాల నాయకులు


అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 23 : కార్మిక హక్కులను కాలరాసే చట్ట సవరణల బిల్లులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌ నుంచి పలు కార్మికసంఘాల ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డు, టవర్‌క్లాక్‌ మీదుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కా ర్యాలయం వరకు భారీర్యాలీ నిర్వహించారు.


అనంతరం బీఎస్‌ ఎన్‌ఎల్‌, తపాలా కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబుళు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రా జారెడ్డి, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారిలో ఏమాత్రం చలనం లేదన్నారు.


కరోనాతో పనులు కోల్పోయిన కార్మికులకు రూ.10వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర స రుకులు ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు నాగమణి, చియ్యేడు రామకృష్ణ, మల్లికార్జున, కృష్ణుడు, రాజేష్‌గౌడ్‌, కసాపురం ఆంజనేయులు, వెంకటనారాయణ, గోపాల్‌, రాజు, కృష్ణానాయక్‌, వేణుగోపాల్‌, రామాంజనేయులు, అక్బర్‌వలీ, నారాయణ, ఏసురత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T08:46:43+05:30 IST