గాయని సునీత పీఏనంటూ టోకరా
ABN , First Publish Date - 2020-08-06T09:26:47+05:30 IST
గాయని సునీత పీఏనంటూ టోకరా
బుక్కరాయసముద్రం, ఆగస్టు5: ప్రముఖ సినీ గాయని సునీత పీఏననీ, ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులకు టోకరా వేశాడు ఓ ఘనుడు. అనంతపురం నగరం లోని ప్రియాంక కాలనీకి చెందిన చైతన్య పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వ సూలు చేసిన ఉదంతం బట్టబయలైంది. చైతన్య హైదరాబాద్లో సినీ గాయని సునీత పీఏననీ, తాను నిర్మించనున్న నూతన షాపింగ్ కాంప్లెక్స్లో మేనేజర్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు నిరుద్యోగులకు టోకరా వేశాడు. బుక్కరాయసముద్రంలోని అనంతసాగర్ కాలనీకి చెందిన సోహైల్బాషా నుంచి రూ.2.50లక్షలు వసూలు చేశాడు. దీనిపై బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గాయని సునీత ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు చైతన్యను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.