కొత్తగా 316 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-06-19T07:00:34+05:30 IST
జిల్లాలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 6466 శాంపిళ్లు ప రీక్షించారు.
- మరో ముగ్గురు మృతి
అనంతపురం వైద్యం, జూన్ 18: జిల్లాలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 6466 శాంపిళ్లు ప రీక్షించారు. 4.89 శాతం పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న మరో ముగ్గురు బాధితులు మరణించారు. జిల్లాలో మొత్తం మీద ఇప్పటి వరకు 151321 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 148772 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1021 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1528 మంది ఇంకా చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.