8 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-21T06:59:58+05:30 IST
: జిల్లాలో కొత్తగా 8 మందికి కరోనా సోకింది. మొత్తం 5296 నమూనాలు పరీక్షించగా 8 మందికి కరోనా నిర్ధారణ అ య్యింది.
అనంతపురం వైద్యం, జనవరి 20 : జిల్లాలో కొత్తగా 8 మందికి కరోనా సోకింది. మొత్తం 5296 నమూనాలు పరీక్షించగా 8 మందికి కరోనా నిర్ధారణ అ య్యింది. అనంతపురంలో 4, బుక్కపట్నం, గుంతకల్లు, కదిరి మండలాల్లో ఒక్కో కేసు వచ్చింది. మరో కేసు తెలంగాణాకు చెందిన వ్యక్తిదని అధికారులు వెల్లడించారు. మరణాలు సంభవించలేదు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 67570కు చేరింది. వీరిలో 66919 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 597 మంది మరణించారు. ప్రస్తుతం 54 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.