కొత్తగా 14 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-03-08T06:48:54+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. గత కొంతకాలంగా సింగిల్‌ డిజిట్‌లోనే కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

కొత్తగా 14 మందికి కరోనా

అనంతపురం వైద్యం, మార్చి 7 : జిల్లాలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. గత కొంతకాలంగా  సింగిల్‌ డిజిట్‌లోనే కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే నాలుగైదు రోజులుగా జిల్లాలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. అనంతపురంలో 7, పామిడి 3, గుంతకల్లు 02, రాప్తాడు, కంబదూరు మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 67815 మంది కరోనా బారిన పడ్డారు.600 మంది మరణించారు. 67153 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 62 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.  

Updated Date - 2021-03-08T06:48:54+05:30 IST