కొత్తగా నాలుగు కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-05T06:44:57+05:30 IST
జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.
అనంతపురం వైద్యం, మార్చి 4: జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 67785 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 67136 మం ది ఆరోగ్యంగా కోలుకున్నారు. 599 మంది మరణించారు. ప్ర స్తుతం 50 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. తలుపుల మండలం ఎరసానిపల్లిలో కరోనా ప్రభావం అఽధికంగా ఉండటంతో ఆ గ్రామంపై అధికారులు ప్రత్యేక దృ ష్టి పెట్టి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
40 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీ
జిల్లావ్యాప్తంగా 40 కేంద్రాల్లో శుక్రవారం కరోనా టీకా వేశారు. తొలి రెండు విడతలతో పాటు మూడో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి దీ ర్ఘకాలిక వ్యాధులతో భాధపడుతున్న వివిధ వర్గాల ప్రజలకు టీకా పంపిణీ చేశారు. చాలామంది దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో టీకా పంపిణీ కేంద్రాలు వెలవెలబోయాయి. జిల్లా ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కామేశ్వరప్రసాద్ రెండో డోస్ టీకా వేయించుకున్నారు.