మరో రెండు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-24T07:02:30+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు

మరో రెండు కరోనా కేసులు

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 23 : జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 67724 కి పెరిగింది. వీరిలో 67098 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 


ఎస్కేయూలో ఐదుగురు విద్యార్థులకు..

ఎస్కేయూ : ఎస్కేయూలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార ణ అయినట్టు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ నాయక్‌ తెలిపారు. సోమవారం నుంచి విద్యార్థులకు వర్సిటీలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులకు మందులు ఇచ్చి హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు.

Updated Date - 2021-02-24T07:02:30+05:30 IST