వైరస్‌ విలయం

ABN , First Publish Date - 2021-05-14T06:36:48+05:30 IST

జిల్లాలో వైరస్‌ విల య తాండవం చేస్తోంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

వైరస్‌ విలయం

కొత్తగా 2080 మందికి కరోనా.. మరో ముగ్గురు మృతి

అనంతపురం వైద్యం, మే13:  జిల్లాలో వైరస్‌ విల య తాండవం చేస్తోంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బాధితులు ఆర్తనాధాలు అదే స్థాయిలో సాగుతున్నాయి. గురువారం గడిచిన 24 గంటల్లో జిల్లా లో కొత్తగా 2080 మందికి కరోనా సోకింది. చికిత్స పొందుతున్న ముగ్గురు కరోనా బాధితులు మరణించారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 105673కు చేరింది. మరణాల సంఖ్య 746 కు పెరిగిపోయింది. ఇందులో 90604 మంది ఆరోగ్యంగా కోలుకోగా ప్రస్తుతం 14323 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


ప్రాంతాల వారీగా నమోదైన కేసులు

జిల్లాలో ఒక్కరోజులో 5827 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇందులో 2080 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 40 శాతం పైగానే కేసులు వచ్చాయి. అనంతపురం 458, గుంతకల్లు 161, కదిరి158, ధర్మవరం 89, హిందూపురం 80, ముదిగుబ్బ 59, కళ్యాణదుర్గం 56, బత్తలపల్లి, తాడిపత్రి 48, బుక్కరాయసముద్రం 42, యల్లనూరు 41, అమరాపురం 39, మడకశిర 38, కంబదూరు 36, కుందుర్పి 35, చిలమత్తూరు, కొత్తచెరువు 33, పెనుకొండ 32, బుక్కపట్నం, కనగానిపల్లి 31, యాడికి 28, కణేకల్లు 27, పుట్టపర్తి, గాండ్లపెంట 26, గోరంట్ల, సోమందేపల్లి, ఉరవకొండ 25, గుమ్మఘట్ట, నా ర్పల, రాప్తాడు, విడపనకల్లు 23, తలుపుల, వజ్రకరూరు 21, ఆత్మకూరు, రాయదుర్గం, గుత్తి 19, శింగనమల 18, కూడేరు 17, సీకేపల్లి 13, ఓడీసీ 11, బ్రహ్మసముద్రం, పామిడి 10, డీ హీరేహాళ్‌, గార్లదిన్నె, ఎన్‌పీ కుంట 7, అమడగూరు, గుడిబండ, తనకల్లు 6, బొమ్మనహాళ్‌, పెద్దపప్పూరు, శెట్టూరు, తాడిమర్రి 5, బెలుగుప్ప, నల్లచెరువు 4, నల్లమాడ, పుట్లూరు, రొళ్ల 2, పెద్దవడుగూరు, లేపాక్షి మండలాల్లో ఒక్కో కేసు నిర్ధారణ అయ్యాయి.

Updated Date - 2021-05-14T06:36:48+05:30 IST