కొత్తగా 16 పాజిటివ్ కేసులు.. మరణాలు నిల్
ABN , First Publish Date - 2020-11-30T05:53:11+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం గడిచిన 24 గంటల్లో 5252 నమూనాలు పరీక్షించగా అందులో 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
అనంతపురం వైద్యం, నవంబరు 29 : జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం గడిచిన 24 గంటల్లో 5252 నమూనాలు పరీక్షించగా అందులో 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అనంతపురం నగరంలో 8, హిందూపురం 2, బొమ్మనహాళ్, కదిరి, ఓడీసీ, రాప్తాడు, ఉరవకొండ, యాడికి మండలాలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. జిల్లాలో గడిచిన ఒక్క రోజులో కరోనా మరణాలు సంభవించలేదు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 66670కు చేరింది. ఇందులో 588 మంది మరణించారు. 65840 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 242 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు.