ఓటు అడుగుతున్నాం.. ప్రచారంలో దూకుడు పెంచిన ఎమ్మెల్యే బాలకృష్ణ

ABN , First Publish Date - 2021-03-07T07:14:35+05:30 IST

‘టీడీపీ హయాంలో అభివృద్ధి చేశాం. అందుకే మీముందుకు వచ్చి, ఓట్లు అడుతున్నా. మెరుగైన పాలన అందించి హిందూపురాన్ని రాష్ట్రంలోనే అగ్రమిగా తీర్చిదిద్దుతామ’ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

ఓటు అడుగుతున్నాం.. ప్రచారంలో దూకుడు పెంచిన ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం, మార్చి 6:టీడీపీ హయాంలో అభివృద్ధి చేశాం. అందుకే మీముందుకు వచ్చి, ఓట్లు అడుతున్నా. మెరుగైన పాలన అందించి హిందూపురాన్ని రాష్ట్రంలోనే అగ్రమిగా తీర్చిదిద్దుతామ’ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా శనివారం హిందూపురంలోని మోడల్‌ కాలనీ, శ్రీకంఠపురం, లక్ష్మీపురం, త్యాగరాజ్‌నగర్‌లో విస్తృతంగా టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశామన్నారు. గుక్కెడు తాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. పట్టణాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేశామన్నారు. ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందనీ, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిస్తే మెరుగైన పాలన అధిస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం చుట్టూ రింగ్‌రోడ్‌ నిర్మాణానికి ప్రతిపాదన చేశామనీ, అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామన్నారు. వైసీపీ రేండేళ్లలో హిందూపురంలో అభివృద్ధి ఏమి చేసిందో నిలదీయాలన్నారు. నిత్యావసర ధరలు ఆకానంటుతున్నాయనీ, సామాన్యులు కొనలేని స్థితిలో ఉన్నా ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలతోపాటు రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి ఏంటో శ్వేతప్రతం విడుదల చేయాలని పట్టుబట్టారు. ప్రచారంలో ప్రతి కాలనీలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆయన వెంట అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నవితమ్మ, టీడీపీ అభ్యర్థులు, నాయకులు, క్యార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T07:14:35+05:30 IST