బీజేపీని అడ్డుకోకపోతే ప్రమాదమే జగన్ సైతం కాషాయ పార్టీకే వత్తాసు..
ABN , First Publish Date - 2021-03-07T07:04:26+05:30 IST
కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని అడ్డుకోపోతే ప్రమాదమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒ వైసీ అన్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్
హిందూపురం, టౌన్, మార్చి 6: కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని అడ్డుకోపోతే ప్రమాదమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒ వైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి స్థానిక ఓ ప్రైపేటు ఫంక్షన్ హాల్లో ఎంఐఎం నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మైనార్టీలకు మోసం చేసి, మోదీ పీఎం కావడానికి సహరించారని విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ కూడా మైనార్టీలకు మోసం చేసి, బీజేపీకి సహకరిస్తోందన్నారు. మైనార్టీలను కాపాడేది ఎంఐ ఎం మాత్రమేనన్నారు. మైనార్టీల ప్రయోజనాల కోసం రాజీ పడితే వైసీపీకి కూడా అదేగతి పడుతుందన్నారు. తాను ఇక్కడికి ప్రచారానికి రాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చాటుతామన్నారు.