ఇందల్‌వాయిలో ఏటీఎం ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-20T05:22:08+05:30 IST

ఇందల్‌వాయి బస్టాండ్‌ ఆవరణలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇండియన్‌ నంబర్‌ 1 ఏటీఎంలో చొరబడి దానిని ధ్వంసం చేసి సుమారు రూ.11లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు డిచ్‌పల్లి సీఐ ర ఘునాథ్‌ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి గ్యాస్‌ కట్టర్లను తెచ్చి మిషన్‌ను బద్దలుకొట్టి నగదు ఎత్తుకెళ్లారన్నారు. బ్యాంకు సిబ్బంది సోమవారం మధ్యాహ్న సమయంలో రూ.20లక్షల నగదు ఏటీఎంలో అమర్చి వెళ్లారని, అర్ధరాత్రి రూ.11లక్షల నగదు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. బ్యాంకు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

ఇందల్‌వాయిలో ఏటీఎం ధ్వంసం

ఇందల్‌వాయి, అక్టోబరు 19: ఇందల్‌వాయి బస్టాండ్‌ ఆవరణలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇండియన్‌ నంబర్‌ 1 ఏటీఎంలో చొరబడి దానిని ధ్వంసం చేసి సుమారు రూ.11లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు డిచ్‌పల్లి సీఐ ర ఘునాథ్‌ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి గ్యాస్‌ కట్టర్లను తెచ్చి మిషన్‌ను బద్దలుకొట్టి నగదు ఎత్తుకెళ్లారన్నారు. బ్యాంకు సిబ్బంది సోమవారం మధ్యాహ్న సమయంలో రూ.20లక్షల నగదు ఏటీఎంలో అమర్చి వెళ్లారని, అర్ధరాత్రి రూ.11లక్షల నగదు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. బ్యాంకు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. 

Updated Date - 2021-10-20T05:22:08+05:30 IST