ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు దోచేశాడు..

ABN , First Publish Date - 2021-04-17T05:55:42+05:30 IST

తన ఏటీఎం మార్చి, తన అకౌంట్‌లో ఉన్న రూ.40 వేలు దోచేశా డని ఓ రైతు లబోదిబోమన్నాడు.

ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు దోచేశాడు..

బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు

కదిరి, ఏప్రిల్‌ 16: తన ఏటీఎం మార్చి, తన అకౌంట్‌లో ఉన్న రూ.40 వేలు దోచేశా డని ఓ రైతు లబోదిబోమన్నాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గాండ్లపెంట మం డలం వద్దిరెడ్డిపల్లికి చెందిన శివానందరెడ్డి శుక్రవారం ఆవులు కొనుగోలు చేయడానికి కదిరికి వచ్చాడు. తన అకౌంట్‌లో ఉన్న డబ్బులను ఏటీఎం ద్వారా తీయడానికి మెయిన బ్రాంచ వద్ద ఉన్న ఏటీఎం వద్దకు వెళ్ళాడు. అక్కడ ఏటీఎం పెట్టి పిననెంబర్‌ కొట్టాడు. అది ఆయన వెనుక ఉన్న వ్యక్తి గమనించాడు. ఇందులో రాదని వేరే ఏటీఎంలో తీసుకోవాలని అతని ఏటీఎంను రైతు కిచ్చి, అతను ఏటీఎంను తీసుకున్నాడు. డబ్బులు రాకపోవడంతో మరో ఏటీఎంకు రైతు వెళ్ళాడు. రైతు ఏటీఎం నుంచి రూ. 40 వేలు డ్రా చేశాడు. విషయం నిదానంగా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ తనకు జరిగిన మోసాన్ని పోలీ సులకు ఫిర్యాదు చేశాడు.


Updated Date - 2021-04-17T05:55:42+05:30 IST