సబ్బవరం సర్పంచ్లకు అచ్చెన్నాయుడు అభినందన
ABN , First Publish Date - 2021-02-25T04:42:02+05:30 IST
సబ్బవరం మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సబ్బవరం మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. బుధవారం దసపల్లా హోటల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ ఫొటోలు దిగారు.