ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!

ABN , First Publish Date - 2020-09-22T18:02:31+05:30 IST

ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయ్యింది. రాష్ట్రంలో టీడీపీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!

అమరావతి: ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయ్యింది. రాష్ట్రంలో టీడీపీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు సమాచారం. ఈ నెల27న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే పట్టం కట్టనున్నారు. పార్టీ కొత్త కమిటీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించనున్నారు.


ఈఎస్ఐ కేసులో అచ్చెన్న జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. సుమారు 70 రోజులు జైల్లో ఉన్నారు. తనను అక్రమంగా ఇరికించారని ... ప్రజల తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్నందుకే కేసులు బనాయించారని అచ్చెన్న పోరాడుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-09-22T18:02:31+05:30 IST