‘ఆటా నాదం’ పాటల పోటీల విజేతల పేర్లను ప్రకటించిన అమెరికా తెలుగు సంఘం

ABN , First Publish Date - 2021-11-18T18:37:36+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా).. “ఆటా నాదం” పేరుతో పాటల పోటీలను ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఆటా మహా సభలు జరిపే ముందు.. ప్రథమంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పలు కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆటా వేడుకల కార్యక్రమంలో భాగం

‘ఆటా నాదం’ పాటల పోటీల విజేతల పేర్లను ప్రకటించిన అమెరికా తెలుగు సంఘం

ఎన్నారై డెస్క్: అమెరికా తెలుగు సంఘం (ఆటా).. “ఆటా నాదం” పేరుతో పాటల పోటీలను ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఆటా మహా సభలు జరిపే ముందు.. ప్రథమంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పలు కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆటా వేడుకల కార్యక్రమంలో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీ గాయకులకు ఆటాలో ప్రత్యేకమైన వేదికను కలిపించాలనే సదుద్దేశముతో సంస్థ “ఆటా నాదం“ పాటల పోటీల కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. పోటీల్లో దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి  పాల్గొన్నారు. ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల ఛైర్ మధు బొమ్మినేని, పాలక మండలి సభ్యులు, సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల,  కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి, శరత్ వేముల, ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి తదితరులు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ ఉన్న గాయని గాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 



ఆటా సంస్థ “ఆటా నాదం” పాటల పోటీలను అక్టోబర్ 23,2021 ప్రారంభించి.. ఈ నెల 13న ముగించింది. పదకొండు మంది యువ గాయనీగాయకులు ఫైనల్ రౌండ్లో పాల్గొనగా ప్రథమ స్థానంలో ప్రణతి కే, ద్వితీయ స్థానములో మేఘన నాయుడు దాసరి, తృతీయ స్థానములో వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల మరియు అభినవ్ అవసరాల నిలిచారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా, రవళి పరిటాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దర్శకులు ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకులు, ఎల్.ఎం.ఏ సంస్థాపకులు, ఆటా సంస్థ ఇండియా సాంస్కృతిక సలహాదారు రామాచారి కొమండూరి కార్యక్రమములో పాల్గొని గాయని గాయకులకు అభినందనలు తెలియజేశారు. 



ఇదిలా ఉంటే.. మధు బొమ్మినేని రెండు తెలుగు రాష్ట్రాలలో అధ్యక్షులు భువనేశ్ బూజల, పాలక మండలి సభ్యులు మరియు ఆటా కార్యవర్గ బృందంతో కలిసి డిసెంబర్ 5 నుంచి 25 తేదీల మధ్య ఎడ్యుకేషనల్ సెమినార్లు, బిజినెస్ సెమినార్లు, స్త్రీ సంక్షేమం తదితర అంశాలపై పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిచబోతున్నారు. ఇందులోని విజేతలకు డిసెంబర్ 26న సాయంత్రం రవీంద్రభారతీలో జరిగే “ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” కార్యక్రములో పాడడానికి ఆటా సంస్థ అవకాశం కల్పిస్తోంది.


Updated Date - 2021-11-18T18:37:36+05:30 IST