గణతంత్ర వేడుకల్లో జడ్పీటీసీ భర్త వర్సెస్ ఎంపీపీ మాటల యుద్ధం
ABN , First Publish Date - 2021-01-27T05:54:10+05:30 IST
గణతంత్ర వేడుకల్లో మంగళవారం జడ్పీటీసీ పుష్పబాయి భర్త మోహన్రావు వర్సెస్ ఎంపీపీ కొంగరి జయశ్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది.
మనూరు, జనవరి 26: గణతంత్ర వేడుకల్లో మంగళవారం జడ్పీటీసీ పుష్పబాయి భర్త మోహన్రావు వర్సెస్ ఎంపీపీ కొంగరి జయశ్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికారుల సాక్షిగా టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలు గుప్పుమన్నాయి. మనూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరైన జడ్పీటీసీ భర్త మోహన్రావు.. ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై, పరోక్షంగా ఎంపీపీని కించపరిచే విధంగా మాట్లాడారు. స్పందించిన ఎంపీపీ జయశ్రీ.. ‘‘మేము ఎప్పుడూ ప్రొటోకాల్ను ఉల్లంఘించలేదు. గతంలో బెల్లాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తాము పక్కనే ఉన్నా.. ప్రొటోకాల్ ఉల్లంఘించి జడ్పీటీసీ భర్తకు ఎలాంటి అర్హత లేకున్నా ప్రారంభోత్సవం చేశారు’’ అని బదులిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసమయం మాటల యుద్ధం జరిగింది. దీంతో మనూరులో జరుగుతున్న గ్రూపు రాజకీయాలు అందరి సమక్షంలో బట్టబయలయ్యాయి.