Peru: బస్సు లోయలో పడి 32 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2021-09-01T13:14:09+05:30 IST
పెరూ దేశంలో కొండపై నుంచి బస్సు లోయలో పడి 32 మంది మరణించిన ఘటన జరిగింది....
లిమా (పెరూ): పెరూ దేశంలో కొండపై నుంచి బస్సు లోయలో పడి 32 మంది మరణించిన ఘటన జరిగింది. పెరూ దేశ రాజధాని నగరమైన లిమాకు 60 కిలోమీటర్ల దూరంలోని కేరెటెరా సెంట్రల్ రోడ్డుపై కొండపై నుంచి వస్తుండగా బస్సు పెద్ద లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా 32 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా వేగంగా నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని పెరూ పోలీసు కమాండర్ సీజర్ సెర్వంటెన్ చెప్పారు. కొండపై నుంచి వేగంగా వస్తున్న బస్సు బండరాయిని ఢీకొని 650 అడుగుల లోతులోని అగాధంలో పడిపోయింది.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెరూ దేశంలో రెండురోజుల క్రితం మరో బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. వేగంగా నడపటం, అధ్వానంగా ఉన్న రోడ్లతో పెరూ దేశంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.