బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-06-11T17:58:37+05:30 IST

బొలీవియా దేశంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు మరణించారు....

బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి దుర్మరణం

సూక్రీ (బొలీవియా): బొలీవియా దేశంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు మరణించారు. బొలీవియా దేశంలోని ఒపోక్వారీ -పిసిగా అంతర్జాతీయ రహదారిపై ఓ లారీ మినీబస్సును ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మరణించిన వారిలో ఐదుగురు పురుషులు, ఓ మహిళ, ఏడాది బాలిక ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-06-11T17:58:37+05:30 IST