Oklahoma Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి!

ABN , First Publish Date - 2022-06-02T13:49:01+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓక్లహామాలోని తుల్సాలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆస్పత్రిలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Oklahoma Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి!

ఓక్లహామా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓక్లహామాలోని తుల్సాలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆస్పత్రిలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్థోపెడిక్ సర్జన్ కోసం వచ్చిన దుండగుడు.. ఆ వైద్యుడు కనిపించలేదని విచక్షణారాహిత్యంగా కాల్పులు జరిపాడు. కాల్పుల తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.కాల్పులు జరిగే సమయంలో భయాందోనకు గురైన వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమై రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడిన ఘటనలో 19 మంది చిన్నారులు సహా 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే మరోసారి అగ్రరాజ్యం కాల్పులతో దద్దరిల్లింది. 

Updated Date - 2022-06-02T13:49:01+05:30 IST