కూలిన ఉక్రెయిన్ సైనిక విమానం.. 26 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2020-09-27T12:08:08+05:30 IST
ఉక్రెయిన్లోని చుహివ్లో విమానం కూలి 26 మంది చనిపోయారు.
మాస్కో, సెప్టెంబరు 26: ఉక్రెయిన్లోని చుహివ్లో విమానం కూలి 26 మంది చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఉక్రెయిన్ వాయుసేనకు చెందిన ఆన్టోనోవ్-26 విమానంలో మొత్తం 27 మంది (ఏడుగురు విమాన సిబ్బంది, 20 మంది సైనిక విమానయాన స్కూల్ కేడెట్లు) ప్రయాణిస్తుండగా.. చుహివ్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యేటపుడు కూలిపోయింది.