Shocking : పెళ్లంటే పరేషాన్‌.. ఒక్కసారిగా డబుల్..!

ABN , First Publish Date - 2022-05-14T12:39:01+05:30 IST

పెళ్లంటే పరేషాన్‌.. ఒక్కసారిగా డబుల్..!

Shocking : పెళ్లంటే పరేషాన్‌.. ఒక్కసారిగా డబుల్..!

  • ఆగిరిపల్లి శోభనాచలుని ఆలయంలో 
  • పెళ్లి రుసుము.. రూ.5 వేలకు పెంపు 

ఏలూరు : పేదవాడి పెళ్లి (Marriage) కూడా పరేషాన్‌గా మారింది. పేదలు, మధ్య తరగతి వర్గాలు లక్షలు వెచ్చించి కల్యాణ మండపాలు అద్దెకు తీసుకోలేరు. వీరంతా వివాహాలకు గుడినే ఆశ్రయిస్తుంటారు. కొందరు ఫలానా ఆలయంలో పెళ్లిళ్లు చేస్తామని మొక్కుకుని భగవంతుడి సన్నిధిలో ఈ తంతు నిర్వహిస్తారు. ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం పెళ్లిళ్లకు ప్రసిద్ది. ఆలయ ఆవరణ విశాలంగా ఉండడంతో చాలా మంది దీనిని వేదికగా చేసుంటున్నారు. ఇలా పెళ్లి జరుపుకున్నందుకు ఆలయానికి రూ.2,500 చెల్లించేవారు.


తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని పేదలు సంతృప్తి చెందేవారు. తాజాగా ఈ వివాహాల రుసుమును అమాంతం రెట్టింపంటే రూ.5,000 చేయడంతో పేదలను దేవుడి కి దూరం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఆలయం వద్ద పెళ్లి భోజనాలు ఏర్పాటు చేసుకుంటే అదనంగా మరో రూ.5,000 చెల్లించాల్సిందేనని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేయడం తీవ్ర విమర్శలపాలవుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో పెళ్లి చేసుకుంటే వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అటువంటిది ఈ ఆల యంలో ఒక్క సారిగా ఐదు వేలు చేయడం.. ఆలయాన్ని కూడా వ్యాపారమయంగా చేయడమేనని ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. - ఆగిరిపలి.



Read more