రమేష్ కుమార్‌‌ను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది: అశ్వనీకుమార్

ABN , First Publish Date - 2020-05-29T20:17:41+05:30 IST

అమరావతి : ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిందని..

రమేష్ కుమార్‌‌ను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది: అశ్వనీకుమార్

అమరావతి : ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిందని ఆయన తరపు లాయర్ అశ్వనీకుమార్ తెలిపారు. నేడు అశ్వనీకుమార్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ తీర్పు అందరికీ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఎన్.రమేష్ కుమార్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిందన్నారు.


ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఉండగా, కోవిడ్-19 ఉన్న సమయంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి తొలగించటాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టిందన్నారు. రమేష్ కుమార్ తరపున దాఖలు చేసిన పిటిషనే న్యాయస్థానం ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని విచారణను చేపట్టిందని అశ్వనీకుమార్ తెలిపారు.

Updated Date - 2020-05-29T20:17:41+05:30 IST