Asus Chromebook: అద్భుతమైన ల్యాప్టాప్స్..
ABN , First Publish Date - 2021-07-15T21:58:43+05:30 IST
Asus Chromebook: అద్భుతమైన ల్యాప్టాప్స్..
న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆసుస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన ఆసుస్ క్రోమ్బుక్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్లో ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సి 214 11.6-అంగుళాల హెచ్డీ టచ్ డిస్ప్లేను కలిగి ఉన్న ల్యాప్టాప్లను విడుదల చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. టచ్ స్క్రీన్లతోపాటు మరియు లేకుండా ఆసుస్ క్రోమ్బుక్ 435 మరియు 523 అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఆసుస్ క్రోమ్బుక్ సి 223 నాలుగు మోడళ్లలో ల్యాప్టాప్లపై చౌకైన ఆఫర్ ప్రకటించింది. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214 రూ. 23,999, ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ423 ల్యాప్టాప్ ప్రారంభ ధర రూ. 19,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది.