జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
ABN , First Publish Date - 2022-01-24T03:47:47+05:30 IST
ప్రముఖ జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండె పోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు...
హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండె పోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్పేట్ హిందూ స్మశాన వాటికలో రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు జరగనున్నాయి. ములుగు సిద్ధాంతిగా రామలింగేశ్వర సిద్ధాంతి పేరొందారు. 30 ఏళ్లుగా జ్యోతిష సేవలందించడంతో పాటు పలు టీవీల్లో రాశిఫలాలు చెప్పేవారు. గుంటూరు ఆయన స్వస్థలం. హైదరాబాద్లో స్థిరపడ్డారు.