సభ్యత్వంతో పార్టీ కార్యకర్తలకు భరోసా

ABN , First Publish Date - 2022-01-29T05:29:34+05:30 IST

కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వంతో ప్రతీకార్యకర్తకు ఎంతో భద్రత ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు.

సభ్యత్వంతో పార్టీ కార్యకర్తలకు భరోసా
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొంరయ్య

- కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య

 జూలపల్లి, జనవరి 28.  కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వంతో ప్రతీకార్యకర్తకు ఎంతో భద్రత ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో ప్రతీ కార్యకర్త పట్టుదలతో పనిచేసి సభ్యత్వ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  కాంగ్రెస్‌ మండల నాయకులు మానుమండ్ల శ్రీనివాస్‌, ముమ్మాడి రవి, కొంకటి భూషనం, వడ్లూరి అంజయ్య, ఎండీ పకీర్‌, చీదురు శ్రీనివాస్‌, మాంకాలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:29:34+05:30 IST