డీపీవో బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-07-03T05:24:00+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారిగా బి.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీపీవోగా జిల్లా గిరిజన విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

డీపీవో బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం రూరల్‌, జూలై 2 : జిల్లా  పంచాయతీ అధికారిగా బి.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీపీవోగా జిల్లా గిరిజన విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్‌ ఉన్నారు. కొత్త డీపీవోగా సత్యనారాయణ నియామకం కావడంతో శనివారం విధుల్లో చేరారు.  మొదట ఆయన కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను కలిసి కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తానని చెప్పారు. 

 

Updated Date - 2022-07-03T05:24:00+05:30 IST