అన్నాడీఎంకేలో చేరి ఎన్నికల బరిలోకి దిగండి : మంత్రి రాందాస్
ABN , First Publish Date - 2021-02-25T15:32:42+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అన్నాడీంకేలో చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి, ఇండియన్ రిపబ్లికన్...
చెన్నై(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అన్నాడీంకేలో చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి, ఇండియన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అత్వాలే హితవు పలికారు. స్థానిక చెన్నై చేపాక్ ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను అమలుచేస్తోందని, రైతులు తమ ఆందోళనను విరమించుకుని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం కలిసికట్టుగా రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోతుందని, అన్నాడీఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.