5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు: సుజనా
ABN , First Publish Date - 2022-03-10T21:17:15+05:30 IST
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టారని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజా విశ్వాసానికి నిదర్శనమే
అమరావతి: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టారని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజా విశ్వాసానికి నిదర్శనమే బీజేపీ విజయమన్నారు. 37 ఏళ్ల తర్వాత యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. ఇది మోదీ, యోగి సమర్థపాలన ఫలితమేనని చెప్పారు. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడినవారికి ఓటమి తప్పలేదని సుజనాచౌదరి హెచ్చరించారు.