అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ABN , First Publish Date - 2022-01-07T15:19:45+05:30 IST

రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా శాసనసభ కార్యకలాపాలను గురువారం ఉదయం ప్రత్యక్ష ప్రసారం చేశారు. కొత్త సంవత్సరం తొలి శాసనసభ సమావేశాలను సచివాలయం వద్దనున్న శాసనసభ హాలులోనే జరపాలని ప్రభుత్వం

అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం

చెన్నై: రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా శాసనసభ కార్యకలాపాలను గురువారం ఉదయం ప్రత్యక్ష ప్రసారం చేశారు. కొత్త సంవత్సరం తొలి శాసనసభ సమావేశాలను సచివాలయం వద్దనున్న శాసనసభ హాలులోనే జరపాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయిం చిన విషయం తెలిసిందే. ఆ మేరకు శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కెమెరాలను కూడా సిద్ధం చేశారు. ఈలోగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగటంతో సమావేశాలను కలైవానర్‌ అరంగంలో జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు బుధవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కలైవానర్‌ అరంగంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కొంత భాగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సభాపతి అప్పావు నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ మేరకు గురువారం ఉదయం గంటసేపు కొనసాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Updated Date - 2022-01-07T15:19:45+05:30 IST