టీడీపీ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం
ABN , First Publish Date - 2021-12-11T23:55:36+05:30 IST
జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. వైసీపీ శ్రేణులను తిక్కారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.