టీకాలు వేయించుకోని వ్యక్తులు బహిరంగ స్థలాల్లోకి రాకుండా నిషేధం

ABN , First Publish Date - 2022-01-25T18:38:27+05:30 IST

కరోనా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అసోం రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులు కొవిడ్ కట్టడికి ఆంక్షలను కఠినతరం చేశారు...

టీకాలు వేయించుకోని వ్యక్తులు బహిరంగ స్థలాల్లోకి రాకుండా నిషేధం

గౌహతి : కరోనా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అసోం రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అధికారులు కొవిడ్ కట్టడికి ఆంక్షలను కఠినతరం చేశారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలను సందర్శించకుండా నిషేధించారు. రాష్ట్రంలో కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలను కఠినతరం చేశారు. టీకాలు వేయించుకోని వ్యక్తులను ఆసుపత్రులు మినహా బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా నిషేధిస్తూ అసోం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 8వ తరగతి విద్యార్థుల వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.పౌరులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు టీకా రుజువును తీసుకెళ్లాలని ప్రభుత్వం కోరింది.‘‘అన్ని జిల్లాల్లోని 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తరగతులన నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యాసంస్థలన్నీ వర్చువల్ ఆప్షన్‌లకు మారతాయి’’ అని విద్యాశాఖ అధికారులుపేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో 9వతరగతి అంతకంటే ఎక్కువ తరగతుల విద్యార్థులకు ప్రత్యామ్నాయ రోజుల్లో పాఠశాలల్లో తరగతులు అనుమతించాలని నిర్ణయించారు. 


Updated Date - 2022-01-25T18:38:27+05:30 IST