అస్సాంలో కొత్తగా 53 కోవిడ్-19 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-05-23T22:22:34+05:30 IST

అస్సాంలో కొత్తగా 53 కోవిడ్-19 కేసులు నమోదు

అస్సాంలో కొత్తగా 53 కోవిడ్-19 కేసులు నమోదు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అస్సాం సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కొత్తగా మరో 53 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 319 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 258 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి 54 మంది కోలుకున్నారని, కరోనాతో నలుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-05-23T22:22:34+05:30 IST